తెలంగాణలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేసిన ఆరోగ్యశాఖ

X
By - TV5 Telugu |13 Feb 2020 12:56 AM IST
ఇప్పటి వరుకు తెలంగాణలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్నారు రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. పుకార్లను నమ్మొద్దని సూచించారు. తెలుగు రాష్ట్రాలకు గాంధీ ఆసుపత్రి నోడల్ కేంద్రంగా పనిచేస్తోందని.. అనుమానితులు స్వచ్ఛంగా వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారని తెలిపారు. కేంద్రం ఆదేశాలతో కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వున్నామని డీహెచ్ శ్రీనివాస్ రావు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com