చెన్నైలో ఉద్రిక్తంగా మారిన ఆందోళనలు

X
TV5 Telugu15 Feb 2020 2:03 PM GMT
తమిళనాడులోని ఉత్తర చెన్నైలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సిఏఏ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ముస్లింలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. వందలాది మందికిపైగా ముస్లింలు ఒక్కసారిగా సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు చేపట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో ఒక్కసారిగా లాఠీలకు పని చెప్పారు. ఆందోళనకారులు, ముస్లింలపై రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఇటు పోలీసుల తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
Next Story