విశాఖలో ఉద్రిక్తత.. ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ పనులను అడ్డుకున్న రైతులు

విశాఖలో ఉద్రిక్తత.. ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ పనులను అడ్డుకున్న రైతులు

విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో ప్రభుత్వ భూసేకరణ పనులు ఉద్రిక్తతకు దారి తీశాయి. పెంటవాని చెరువు దగ్గర ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ పనులను గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే అక్కడ పోలీసులు మోహరించారు. రైతులకు మద్దతుగా టీడీపీ నేతలు బండారు సత్యనారాయణ మూర్తి, గండి బాబ్జీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బలవంతపు భూసేకరణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story