కరోనావైరస్ : చైనాలో పెరిగిన మరణాలు.. తగ్గిన కేసుల సంఖ్య

కరోనావైరస్ : చైనాలో పెరిగిన మరణాలు.. తగ్గిన కేసుల సంఖ్య

చైనాలో బుధవారం రోజు కరోనావైరస్ వ్యాప్తి ద్వారా 114 కొత్త మరణాలు సంభవించాయని ఆ దేశ ఆరోగ్య కమిషన్ గురువారం వెల్లడించింది.ఈ క్రమంలో చైనా వ్యాప్తంగా ఇప్పటివరకు 2,118 మరణాలు సంభవించినట్టు తెలిపింది. అయితే బుధవారం నమోదైన కొత్త మరణాల సంఖ్యలో 108 మంది కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న హుబీ ప్రావిన్స్ లో సంభవించాయి. అంతేకాదు జాతీయ ఆరోగ్య కమిషన్ బుధవారం రోజు కొత్తగా 394 కేసులను నివేదించింది, అంతకుముందు రోజు దేశవ్యాప్తంగా నమోదైన 1,749 కేసులతో పోలిస్తే ఇది చాలా తక్కువని.. అలాగే కొత్త ఇన్ఫెక్షన్లలో 349 మంది హుబీకి చెందినవారు అని.. దీంతో దేశవ్యాప్తంగా, కేసులు ఇప్పుడు 74,576 కు పెరిగిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story