సమైక్యపాలనలో తెలంగాణ దేవాలయాలకు కూడా అన్యాయం జరిగింది: హరీష్ రావు

సమైక్యపాలనలో తెలంగాణ దేవాలయాలకు కూడా అన్యాయం జరిగింది: హరీష్ రావు

మెదక్‌ జిల్లాలోని ఏడుపాయల్లో మహాశివరాత్రి జాతర ఉత్సవాలను ఆర్థికమంత్రి హరీష్‌ రావు ప్రారంభించారు. వనదుర్గ మాతకు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సమైక్య పాలనలో తెలంగాణ దేవాలయాలకు కూడా అన్యాయం జరిగిందన్నారు హరీష్‌ రావు. వచ్చే శివరాత్రి నాటికి కాళేశ్వరం నీళ్లు మెదక్‌కు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరం పనులు చేస్తున్నారన్నారు. ఈ ప్రాంత రైతులకు రెండు పంటలకు నీళ్లు ఇవ్వడమే తమ లక్ష్యం అని హరీష్‌ రావు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story