అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని గతంలోనే చెప్పాం : బొత్స

X
By - TV5 Telugu |22 Feb 2020 11:23 PM IST
అవకతవకలపై విచారణ చేయడం కక్ష సాదింపు ఎలా అవుతుందని ప్రశ్నించారు మంత్రి బొత్స. అమరావతిలో భూ కుంభకోణంపై విచారణ చేయించండి, సీబీఐ ఎంక్వైరీ వేయండి అంటూ గోల చేసిన టీడీపీ.. ఇప్పుడు సిట్ ఏర్పాటును ఎందుకు తప్పుపడుతోందని నిలదీశారు. రాజధానిలో భారీగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని గతంలోనే చెప్పామని.. ఇప్పుడు విచారణ చేయిస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పని చేసిన బీసీ మంత్రులను టార్గెట్ చేస్తున్నారనడం హాస్యాస్పదం అన్నారు మంత్రి బొత్స.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com