గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం
గుంటూరు జిల్లా రేపల్లె మండలం నడింపల్లిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. రమాదేవి అనే మహిళపై సైనికోద్యోగి తుపాకీతో కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తూ ఆ టైమ్లో ఆమె పక్కకు తప్పుకోవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. కొన్నాళ్లుగా రమాదేవి కుమార్తె వెంట పడుతున్నాడు బాలాజీ అనే యువకుడు. ఈ ప్రేమను ఒప్పుకునేది లేదని అమ్మాయి తల్లి రమాదేవి చెప్పడంతో కక్ష పెంచుకున్నాడు. శనివారం తెల్లవారుజామున తుపాకీ తెచ్చి కాల్పులు జరిపాడు. లక్కీగా తూటా నుంచి తప్పించుకుంది రమాదేవి. ఆమె చెవిని తాకుతూ బుల్లెట్ వెళ్లిపోయింది. భయాదోళనకు గురైన ఆమె కేకలు వేయడంతో బాలాజీ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కంగారులో తుపాకీ అక్కడే పడేశాడు. నిందితుడు బాలాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతనికి సహకరించిన ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com