తెలంగాణ సీఎంకు అరుదైన గౌరవం.. ట్రంప్తో విందుకు కేసీఆర్కు ఆహ్వానం
By - TV5 Telugu |22 Feb 2020 2:25 PM GMT
తెలంగాణ సీఎం కేసీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో విందుకు కేసీఆర్కు ఆహ్వానం అందింది. ఈనెల 25న రాష్ట్రపతి భవన్లో అమెరికా అక్ష్యక్షుడు ట్రంప్ గౌరవారర్థం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరుకావాలని కేసీఆర్తో పాటు 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి ఆహ్వానం పంపారు. ఈవిందులో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ 25న ఢిల్లీ వెళ్లనున్నారు. ట్రంప్తో విందుకు ప్రధాని మోదీతో పాటు మొత్తం 95 మందికి రాష్ట్రపతి కోవింద్ ఆహ్వానం పంపినట్లు సమాచారం.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com