ప్రేమోన్మాది బాలాజీ సూసైడ్.. రైలు కిందపడి..
By - TV5 Telugu |23 Feb 2020 3:48 PM GMT
గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది బాలాజీ సూసైడ్ చేసుకున్నాడు. బాపట్ల సమీపంలో రైలు కిందపడి చనిపోయాడు. నిన్న రేపల్లె మండలం నడింపల్లిలో.. రమాదేవి అనే మహిళపై కాల్పులు జరిపాడు బాలాజీ. రమాదేవి కూతురిని తనకు ఇచ్చి పెళ్లి చేయడం లేదన్న కారణంగానే ఆ కుటుంబంపై దాడికి దిగాడు. గతంలోనే తనపై వాళ్లు ఫిర్యాదు చేయడం, తాజాగా కాల్పుల కేసు కూడా నమోదవడంతో బాలాజీ ప్రాణాలు తీసుకోవాలని భావించాడు. రైలు కింద తల పెట్టి ప్రాణాలు వదిలాడు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com