అన్న క్యాంటీన్లను మళ్లీ తెరవాలని డిమాండ్
By - TV5 Telugu |24 Feb 2020 4:39 PM GMT
అన్న క్యాంటీన్ల మూసివేతపై... ఏపీలో టీడీపీ నేతలు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అన్న క్యాంటీన్లను మళ్లీ తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో... మాజీ ఎమ్మెల్యే బి.వి.జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సోమప్ప సర్కిల్లోని అన్న క్యాంటీన్ తిరిగి తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించాలని... వంటా వార్పు నిర్వహించారు. పేదలకు స్వయంగా వడ్డించారు బి.వి.జయనాగేశ్వర్ రెడ్డి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com