ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మండిపడుతున్న అమరావతి రైతులు

రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు ఇచ్చిన భూములను ఏపీ ప్రభుత్వం పేదల కోసం ఇళ్ల నిర్మాణాలకు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం తీసుకన్న ఈ నిర్ణయాన్ని రాజధాని రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తుంది. రాజధానిని విశాఖకు తరలించేస్తూ తామిచ్చిన భూములు ఇళ్ల పట్టాలకు ఎలా కేటాయిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. పాలన రాజధాని అమరావతిలో ఉంటే తమ భూములు కూడా అభివృద్ధి చెందుతాయని భావించి తాము పూలింగ్లో భూములిచ్చామని కానీ రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వంచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము పేదల ఇళ్ల పట్టాలకు వ్యతిరేకం కాదని.. ప్రభుత్వం కావాలనే ఈ విషయంలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోందని అంటున్నారు. ఇటీవలే రాజధాని గ్రామల్లో భూములను గుర్తించేందుకు తహశీల్దార్ వచ్చిన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మందడం- కృష్ణాయపాలెం మధ్య రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఆఫీసర్లను నిర్భందించారన్న కారణంగా 428 మంది రైతులకే కేసులు కూడా పెట్టారు. ఇప్పటికే ఈ పరిణామాలతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న రైతులు.. ఇప్పుడు పేదల ఇళ్ల పట్టాలపై జీవో రావడంపై మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com