రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. 24మంది మృతి
By - TV5 Telugu |26 Feb 2020 2:18 PM GMT
రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 24 మంది చనిపోయారు. బూండీలోని కోట లాల్సాత్ మెగా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకల కోసం వరుడి కుటుంబం, బంధువులతో కలిసి.. కోట నుంచి సవాయ్మాధోపూర్ వెళ్తున్న బస్సు.. ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి మేజ్ నదిలో పడిపోయింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా ఉన్నారు. ఇప్పటివరకు 24 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com