విశాఖ వచ్చి చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆరా తీసిన నారా భువనేశ్వరి

X
By - TV5 Telugu |28 Feb 2020 1:49 AM IST
విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని అరెస్టు చేసిన వెంటనే, ఆయన సతీమణి నారా భువనేశ్వరి విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లాంజిలో చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
ఉద్రిక్త పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబును సెక్షన్ 151 కింద అదుపులోకి తీసుకుని విమానాశ్రయంలోని విఐపి లాంజ్కు తీసుకెళ్లారు. కాగా చంద్రబాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా విశాఖలో టీడీపీ నేతలు గళమెత్తారు. గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com