త్వరలో 100 బస్సులతో ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభిస్తాం : మంత్రి పువ్వాడ అజయ్‌

త్వరలో 100 బస్సులతో ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభిస్తాం : మంత్రి పువ్వాడ అజయ్‌

సీఎం కేసీఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా ఖమ్మం అభివృద్ధి జరుగుతోందన్నారు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్. మార్చి 1న ఖమ్మం, ఇల్లందులో నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొననున్నారని చెప్పారు. కేసీఆర్‌ డిగ్నిటీ హోమ్‌ పేరుతో నిర్మించిన 300 డబుల్ బెడ్‌ రూం ఇండ్లను పేదలకు అందజేయనున్నట్లు తెలిపారు. వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్ మార్కెట్‌, బాస్కెట్ బాల్ ఇండోర్ స్టేడియం, మిని ట్యాంక్‌ బండ్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే 100 ఆర్టీసీ కార్గో సేవలను ప్రారంభించనున్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story