అమరావతి ఉద్యమానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా మద్దతు

అమరావతి ఉద్యమానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా మద్దతు

అమరావతి ఉద్యమం 72వ రోజుకు చేరకుంది. మందడం, తుళ్లూరు సమా రాజధాని గ్రామాల్లో ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు కొనసాగాయి. వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డులో రైతులు, మహిళలు చేస్తున్న ధర్నాలు కొనసాగుతున్నాయి.

అమరావతి ఉద్యమానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్దయెత్తున మద్దతు లభిస్తోంది. రాజధాని రైతులకు బెంగళూరు పారిశ్రామికవేత్తలు మద్దతు తెలిపారు. మందడం శిబిరంలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులను కలిసి సంఘీభావం ప్రకటించారు. భూకబ్జాల కోసమే సీఎం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారని ఆరోపించారు. వైజాగ్ రాజధాని అంటున్న జగన్.. అక్కడ ఒక్క ఎకరం భూమి తీసుకోగలరా అని ప్రశ్నించారు. రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని.. జగన్ తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాజధాని గ్రామాల్లో కొనాసగుతున్న ధర్నాలు, నిరసనలు, ఆందోళన కార్యక్రమాల్లో.. మహిళలు, రైతులు పెద్దయెత్తున పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్దయెత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story