విశాఖ ఎయిర్పోర్టులో పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేసే అవకాశం
By - TV5 Telugu |28 Feb 2020 12:19 PM GMT
గురువారం విశాఖ ఎయిర్పోర్టులో పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం పార్టీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేసే అవకాశం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం వాదనలు జరిగే ఛాన్స్ ఉంది. ప్రజా చైతన్యయాత్రలో భాగంగా గురువారం విశాఖ చేరుకున్న చంద్రబాబును వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు ముందస్తు అనుమతి తీసుకున్నా.. వైసీపీ కార్యకర్తల్ని నిలువరించడంలో పోలీసుల వైఫల్యం చెందారు. దీంతో రోజంతా విశాఖ ఎయిర్పోర్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com