గో ఎయిర్ విమానంలో రెండు పావురాలు..
By - TV5 Telugu |29 Feb 2020 4:26 PM GMT
అహ్మదాబాద్ నుంచి జైపూర్ వెళ్తున్న గో ఎయిర్ విమానంలోకి రెండు పావురాలు ప్రవేశించాయి. దాంతో కాసేపు ప్రయాణికులు ప్రత్యేక అనుభూతి పొందారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. అహ్మదాబాద్ విమానాశ్రయంలో గో ఎయిర్ విమానం టేకాఫ్ కోసం సిద్ధమవుతుండగా హఠాత్తుగా క్యాబిన్ లోపల పావురాలు దూరాయి. వీటిని సిబ్బంది గమనించారు. బయటికి పంపించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అవి విమానం లోపల అంతటా ఎగరడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ప్రయాణికులు వాటిని తమ ఫోన్ కెమెరాల్లో చిత్రాలుగా బంధించారు. ఆ దృశ్యాలు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com