రాజకీయాల్లో యువత ఆవశ్యకతపై యువ తెలంగాణ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం
By - TV5 Telugu |29 Feb 2020 9:47 PM GMT
మార్పు కోసం, తెలంగాణ మనుగడ కోసం యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని యువ తెలంగాణ ఆద్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయ పడ్డారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఈ సమావేశం జరిగింది. KCR సర్కార్ మాటలు చెప్పడం తప్ప.. యువతకు చేసింది ఏమి లేదని వక్తలు ఆరోపించారు. ఆరేళ్ళ టీఆర్ఎస్ పాలనలో సీఎం KCR ఏ హామీ నేరవేర్చలేదని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో జిట్టా బాలకృష్ణా రెడ్డి ,రాణీ రుద్రమ, పల్లె రవి ఇతర రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com