సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఇవాంకా మార్ఫింగ్‌ ఫోటోలు

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఇవాంకా మార్ఫింగ్‌ ఫోటోలు

భారత పర్యటన మధుర స్మృతులు ఇవాంకా ట్రంప్ ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.. భారత పర్యటన ముగిసి వారం రోజులు అవుతున్నా ఇప్పటికీ ఆమె తన పర్యటన విశేషాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూనే ఉంది. తాజాగా నటుడు, గాయకుడు దిల్జిత్‌ దొసాంజ్‌ చేసిన ఓ ట్వీట్‌కు ఇంవాంకా సరదగా రిప్లై ఇవ్వడంతో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌ అయ్యింది.

ఇటీవల తాజ్‌మహల్‌ను అమెరికా అధ్యక్షుడు కూతురు ఇవాంకా ట్రంప్‌ సందర్శించారు. అందులో ఆమె తాజ్‌మహల్‌ దగ్గర దిగిన ఓ ఫొటోను దిల్జిత్‌ ఫొటోషాప్‌ ఉపయోగించి మార్ఫింగ్‌ చేసి, ఇవాంకా పక్కన తన ఫొటో పెట్టుకున్నాడు. ఇవాంకాను తాజ్‌మహల్‌ దగ్గరకు తీసుకెళ్లాను.. అంతకంటే ఏం చేయగలను ? అంటూ ఆ ఫోటో కింద కామెంట్‌ చేశాడు.

దిల్జిజ్‌ ఫోటోను చూసిన ఇవాంకా వెంటనే స్పందించారు. తనను తాజ్‌మహల్‌ దగ్గరకు తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు చెప్పారు. దీన్ని తానెప్పటికీ మరచిపోలేనంటూ రిప్లై ఇచ్చారు. దీనిపై దిల్జిత్‌ స్పందిస్తూ.. ఓ మైగాడ్‌.. కృతజ్ఞతలు ఇవాంకా ! ఇది ఫొటోషాప్‌ చేసిన చిత్రం కాదని అందరికీ చెప్పేప్రయత్నం చేస్తున్నారని మరో ట్వీట్‌ చేశారు. ఈసారి లూథియానాకు రండి అంటూ రిక్వెస్ట్‌ చేశాడు..

ఆ ట్వీట్‌కు మళ్లీ ఇవాంకా సమాధానం ఇచ్చారు. భారతీయ అభిమానులను అభినందిస్తున్నా అంటూ ఫొటోషాప్‌ చేసిన మరికొన్ని చిత్రాలను ఆమె షేర్‌ చేశారు. తనపై ఫొటోషాప్‌ చేసిన ఫొటోలపై ఇవాంకా సీరియస్‌గా కాకుండా సరదాగా స్పందించడంతో అంతా హ్యాపీగా ఫీలవుతున్నారు.

Ivanka trump reacts after diljit dosanjh shares her photoshopped taj mahal image

Tags

Read MoreRead Less
Next Story