మరోసారి రోడ్డెక్కిన కంది రైతులు

మరోసారి రోడ్డెక్కిన కంది రైతులు

యాదాద్రి - భువనగిరి జిల్లా పరిధిలోని మోత్కూరు వ్యవసాయ మార్కెట్‌లో కంది రైతులు మరోసారి రోడ్డెక్కి ధర్నా చేశారు. ఈ మార్కెట్‌లో హమాలీలు.. తమ నుంచి భారీగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని, ఇదేంటని అడిగినందుకు తమపై దాడికి పాల్పడ్డారంటున్నారు. హమాలీల దౌర్జన్యానికి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు రైతులు. తమను రక్షించాలంటూ.. అధికారులు, పోలీసులను వేడుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story