మరోసారి రోడ్డెక్కిన కంది రైతులు
By - TV5 Telugu |2 March 2020 6:16 PM GMT
యాదాద్రి - భువనగిరి జిల్లా పరిధిలోని మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో కంది రైతులు మరోసారి రోడ్డెక్కి ధర్నా చేశారు. ఈ మార్కెట్లో హమాలీలు.. తమ నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇదేంటని అడిగినందుకు తమపై దాడికి పాల్పడ్డారంటున్నారు. హమాలీల దౌర్జన్యానికి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు రైతులు. తమను రక్షించాలంటూ.. అధికారులు, పోలీసులను వేడుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com