ఉరి ఆలస్యం ప్రభుత్వ వైఫల్యం : నిర్భయ తల్లి

ఉరి ఆలస్యం ప్రభుత్వ వైఫల్యం : నిర్భయ తల్లి

నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరితీయడంలో ఆలస్యం అనేది.. మన వ్యవస్థ క్రిమినల్స్ కు సపోర్ట్ చేస్తుందని.. ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అని నిర్భయ తల్లి ఆషా దేవి సోమవారం చెప్పారు. దోషులను ఉరితీయడంలో ఎందుకు ఆలస్యం జరిగిందో ప్రభుత్వం కోర్టుకు సమాధానం చెప్పాలి అని ఆమె అన్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు తీహార్ జైలులో నలుగురిని ఉరి తీసే ముందు కొన్ని గంటల ముందు పాటియాల హౌస్ కోర్టు మూడవసారి దోషుల ఉరిశిక్షను నిలిపివేసిన తరువాత ఆమె వ్యాఖ్యలు చేశారు.

చివరి నిమిషంలో పవన్ గుప్తా దాఖలు క్షమాబిక్ష పిటిషన్ ఇది.. నలుగురిలో ఇదే చివరిది.. అయితే ఈ పిటిషన్ రాష్ట్రపతి భవన్ వద్ద ఇంకా పెండింగ్‌లో ఉందని న్యాయమూర్తి ధర్మేంద్ర రానా తీర్పునిచ్చారు. దోషి యొక్క క్షమాబిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్నందున మరణశిక్షను అమలు చేయలేమని.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వచ్చే వరకు ఉరి ఆపాలని కోర్టు సూచిందింది.

Tags

Read MoreRead Less
Next Story