టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమైన ముస్లిం సంఘాల ప్రతినిధులు

టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమైన ముస్లిం సంఘాల ప్రతినిధులు

టీడీపీ అధినేత చంద్రబాబుతో ముస్లిం సంఘాల ప్రతినిధులు సమావేశం అయ్యారు. NPR, CAA, NRC విషయంలో వైసీపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని ముస్లిం సంఘాల నేతలు ఆరోపించారు. సీఎం జగన్ ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసమే జగన్నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు చంద్రబాబుకు ఓ వినతిపత్రం అందజేశారు. ముస్లిం హక్కుల పరిరక్షణకు టీడీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story