ఢిల్లీలో కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ అరెస్ట్.. ముందస్తు బెయిల్ నిరాకరణ
By - TV5 Telugu |5 March 2020 5:35 PM GMT
ఢిల్లీలో ఐబీ అధికారి అంకిత్ శర్మను హత్య చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ గురువారం రోజ్ అవెన్యూ కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నించారు. అయితే, ఇది తమ పరిధికి సంబంధించిన విషయం కాదని కోర్టు నిరాకరించింది. దాంతో ఢిల్లీ పోలీసులు అతన్ని కోర్టు దగ్గర అరెస్ట్ చేశారు. అయితే కర్కార్దూమా కోర్టులో తాహిర్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తును కూడా దాఖలు చేశారు, దీనిని కోర్టు తిరస్కరించింది. అల్లర్లలో అతని
పేరు వెలువడిన తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ తాహిర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఫిబ్రవరి 28 న తాహిర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com