ప్రజా సమస్యలు చర్చకు వచ్చేలా.. అసెంబ్లీ సమావేశాలు జరగాలి: భట్టి విక్రమార్క

X
By - TV5 Telugu |6 March 2020 12:01 AM IST
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు సీఎల్పీనేత భట్టివిక్రమార్క. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఒక్క ఎకరా కూడా సాగు కాలేదని.. కాంగ్రెస్ హయాంలోనే నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచే నీళ్లువస్తున్నాయని భట్టి స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 30పనిదినాలు జరుగాలని.. ప్రజా సమస్యలు చర్చకు వచ్చేలా సమావేశాలు జరుగాలని భట్టివిక్రమార్క అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com