విశాఖ సముద్ర తీరంలో కరోనా కలకలం

విశాఖ సముద్ర తీరంలో కరోనా కలకలం

విశాఖ తీరంలో ఒక్కసారిగా కరోనా కలకలం రేగింది. చైనాకు చెందిన 'ఫార్చూన్‌ హీరో' షిప్‌ తీరానికి సమీపంలోకి రావడంతో పోర్ట్‌కి రావడానికి అధికారులు అనుమతి నిరాకరించారు. పారాదీప్ పోర్టు అనుమతి నిరాకరించడంతో విశాఖకు వచ్చిన ఈ షిప్‌లో 22 మంది నావికులు ఉన్నారు. వీరికి కరోనా సోకిందన్న అనుమానంతో ఒడ్డుకు రావొద్దని ఆంక్షలు విధించారు. శుక్రవారం వీరికి వైద్యపరీక్షలు చేసే అవకాశం ఉంది. ఏదేమైనా సరే ముందు జాగ్రత్తగా ఈ షిప్‌ను వెనక్కు తిప్పి పంపాలనే పోర్ట్ వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కరోనా పేరెత్తితేనే ఏపీ, తెలంగాణల్లో బెంబేలెత్తిపోతున్నారు. అలాంటిది ఏకంగా చైనా నుంచి వచ్చిన షిప్ అంటే సహజంగానే మరింత కంగారు ఉంటుంది. పైగా షిప్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిపైనా స్పష్టత లేకపోవడంతో పోర్ట్‌కి రావడానికి అనుమతివ్వలేదు.

Tags

Read MoreRead Less
Next Story