స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తాం: కన్నా లక్ష్మీ నారాయణ

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తాం: కన్నా లక్ష్మీ నారాయణ

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో కలిసి అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పదాధికారుల సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్చించామని అన్నారు. వైసీపీ పాలనలో అవినీతి, ఫ్యాక్షనిజయం రాజ్యమేలుతోందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి.. అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు కన్నా.

Tags

Read MoreRead Less
Next Story