పార్టీ మీటింగ్‌లో కన్నీరు పెట్టుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి

పార్టీ మీటింగ్‌లో కన్నీరు పెట్టుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి

ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి కన్నీరుపెట్టారు. పార్టీ అగ్రనేతలు కూర్చున్న వేదికపై ఉన్నట్టుండి ఆమె కన్నీటిపర్యంతం కావడం చర్చనీయాంశమైంది. విజయనగరంలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ ఘటన జరిగింది. మొదట పుష్పశ్రీవాణి భర్త పరీక్షిత్ రాజును వేదికపైకి పిలువలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు మరికొంత మంది పార్టీ నేతలను మాత్రమే వేదికపైకి ఆహ్వానించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన పుష్పశ్రీవాణి.. ఈ విషయాన్ని పక్కనే ఉన్న విజయసాయిరెడ్డికి చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విజయసాయిరెడ్డి సూచన మేరకు తిరిగి పరీక్షిత్ రాజును వేదికపైకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story