తిరుపతిలో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు

తిరుపతిలో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు

తిరుపతిలో వైసీపి కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. బొమ్మల క్వార్టర్స్ లో నివాసముంటున్న మునిలక్ష్మి అనే నిరుపేద మహిళ స్థలాన్ని కబ్జాచేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. రెండురోజులక్రితమే ఆ స్థలం మునిలక్ష్మికి చెందినది అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోని వైసీపీ కార్యకర్తలు తెల్లవారుజామున మునిలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి భార్యాభర్తలపై దాడికి దిగారు. పదిమందికిపైగా వచ్చిన వైసీపీ కార్యకర్తలు వారిపై దాడికి పాల్పడ్డారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన మునిలక్ష్మిని స్థానికులు తిరుపతి ప్రభుత్వ రుయాఆస్పత్రికి తరలించారు.

మంగళం సమీపంలోని బొమ్మల క్వార్టర్స్ నివసిస్తున్న నిరుపేద మునిలక్ష్మికి 20 ఏళ్లక్రితం ప్రభుత్వం కొంత నివాస స్థలాన్ని ఇచ్చింది. దీనిపై వైసీపీ కార్యకర్తల కన్నుపడింది. మునిలక్ష్మి స్థలాన్ని కబ్జాచేసేందుకు వారు గతంలో ప్రయత్నించారు. దీంతో చేసేది లేక మునిలక్ష్మి, ఆమె భర్త సుబ్రహ్మణ్యం కోర్టును ఆశ్రయించారు. స్థలం పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు, ఈ స్థలం మునిలక్ష్మికి చెందినదే అంటూ తీర్పును వెల్లడించింది. దీంతో వైసీపి కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయి మునిలక్ష్మి ఇంటిపై దాడికి పాల్పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story