మాజీ మంత్రి పరసా వెంకటరత్నం కారు ధ్వంసం చేసిన వైసీపీ కార్యకర్తలు
By - TV5 Telugu |11 March 2020 8:26 PM GMT
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. తాళ్లవాయపాడు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి నరసయ్య నామినేషన్ పత్రాలు చింపేశారు. దీంతో మళ్లీ నామినేషన్ వేసేందుకు అభ్యర్థిని కారులో తీసుకెళ్లారు మాజీ మంత్రి పరసా వెంకటరత్నం. అయితే వైసీపీ నేతలు ఆయన కారుని కూడా అడ్డుకున్నారు. అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పెళ్లకూరు పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు వెంకటరత్నం.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com