ఇరాక్‌పై మరోసారి విరుచుకు పడిన అమెరికా

ఇరాక్‌పై మరోసారి విరుచుకు పడిన అమెరికా

ఇరాక్‌పై అమెరికా విరుచుకుపడింది. వైమానిక దాడులతో హోరెత్తించింది. ఇరాక్‌-అన్బర్ ప్రావిన్స్‌లోని సాయుధ ముఠాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. తాజి మిలటరీ స్థావరంపై 15కు పైగా చిన్న రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడిలో శత్రువులకు భారీ నష్టం జరిగిందని అమెరికా పేర్కొంది. నష్టం తీవ్రతను అంచనా వేస్తున్నామని, భారీ సంఖ్యలోనే తిరుగుబాటుదారులు చనిపోయారని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం నాడు అమెరికా సైనికులపై ఇరాక్ సాయుధ బలగాలు రాకెట్ దాడులు జరిపాయి. ఆ దాడుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. దాంతో అమెరికా సైన్యం ప్రతిదాడులకు దిగింది.

Tags

Read MoreRead Less
Next Story