కూతురితో నామినేషన్ వేయించావు... నీ కథ తెలుస్తా! : వైసీపీ అరాచకం
కూతురితో నామినేషన్ వేయించావు... నీ కథ తెలుస్తా! రౌడీ షీట్ ఓపెన్ చేయిస్తా! ఇవి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్ధులకు వైసీపీ నేతలు, పోలీసుల నుంచి వస్తోన్న బెదిరింపులు! గుంటూరు జిల్లాలో చిలుకూరిపేటలో అధికారపార్టీలనేతలు, పోలీసుల బెదిరింపులతో... ఎంపీటీసీ అభ్యర్ధుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల ఎంపీటీసీగా దళిత సామాజిక వర్గానికి చెందిన కట్టా దివ్య నామినేషన్ వేశారు. నామినేషన్ వేసినప్పటినుంచి దివ్య తండ్రి కట్టా నాగేశ్వరరావుకు... వైసీపీ నేతలు, పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.
కూతురితో నామినేషన్ వేయించావు! నీ అంతు చూస్తామంటూ పోలీసులు సైతం బెదిరించడంతో.... నాగేశ్వరరావు సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశారు. నాదెండ్ల ఎస్సై ఫోన్ చేసి... రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని బెదిరించినట్లు తెలిపాడు. పదేపదే ఎస్సై ఫోన్ చేసి పిలిపించి బెదిరిస్తునట్లు బాధితుడు సెల్ఫీ వీడియోలో తెలిపాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com