రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం

రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రయిలర్ ట్రక్, జీప్ ఎదురెదురుగా ఢీకొనడంతో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జోధ్పూర్ జిల్లాలోని బలోత్రా-ఫలోడి హైవేపై ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను బలోత్రా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story