టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల బి-ఫామ్‌లను చించేసిన వైసీపీ

టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల బి-ఫామ్‌లను చించేసిన వైసీపీ

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియెజకవర్గం ముప్పాళ్ల ఎమ్‌డీఓ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్ధుల బి-ఫామ్‌లను వైసీపీ నాయకులు చించివేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. MDO ఆఫీస్‌ నుంచి టీడీపీ నాయకులను బలవంతంగా బయటకు పంపించి ఇలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు వైసీపీ నేతలు. దమ్మాలపాడు- 2 ఎంపీటీసీ అభ్యర్ధి సిరిగిరి వెంకట్రావు బీ-ఫామ్‌ను వైసీపీ నేతలు చించివేస్తున్నా.. అక్కడే పోలీసులు ఉన్నా చూస్తూ చోద్యం చేశారే తప్ప వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Tags

Read MoreRead Less
Next Story