ప్రత్యర్థి పార్టీలను పోటీ నుంచి తప్పించేందుకు.. అడ్డదారులు తొక్కుతున్న వైసీపీ నేతలు

ప్రత్యర్థి పార్టీలను పోటీ నుంచి తప్పించేందుకు.. అడ్డదారులు తొక్కుతున్న వైసీపీ నేతలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను పోటీ నుంచి తప్పించేందుకు.. వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. సామ, దాన, దండోపాయాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే విపక్ష పార్టీలకు చెందిన అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా దాడులకు తెగబడ్డ వైసీపీ నేతలు.. ఇప్పుడు పోటీ నుంచి తప్పుకునేలా ప్రలోభాలకు తెరతీస్తున్నారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్ధి బండారుపల్లి సత్యనారాయణను పోటీ నుంచి తప్పుకోవాలని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ భర్త, కుమారస్వామి, జెడ్పీటీసీ అభ్యర్ధికి ఫోన్‌ చేసి జెడ్పీటీసీ పోటీకి విత్‌డ్రా చేసుకోవాలని కోరిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని వైసీపీ నేతలు పాల్పడుతున్న దౌర్జన్యాలు, అరాచకాలకు ఇదే నిదర్శనం అంటూ.. టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story