కర్నూలు జిల్లాలో భూసేకరణను అడ్డుకున్న పేదలు

X
By - TV5 Telugu |16 March 2020 10:57 PM IST
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బలవంతపు భూ సేకరణకు వెళ్లిన అధికారులను పేదలు అడ్డుకున్నారు. గతంలో టీడీపీ హయాంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి.. కొత్త పట్టాలు ఇవ్వడానికి అధికారులు ప్రయత్నించారు. దీంతో తమ స్థలాలను ఎలా వదులుకుంటామంటూ ఇళ్లపట్టాలు కలిగిన పేదలు ఆందోళనకు దిగారు. అయినా పట్టించుకోకుండా బలవంతంగా భూములు తీసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో రెవెన్యూ అధికారులను అడ్డుకున్న లబ్దిదారులు ఆందోళన చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com