కర్నూలు జిల్లాలో భూసేకరణను అడ్డుకున్న పేదలు

కర్నూలు జిల్లాలో భూసేకరణను అడ్డుకున్న పేదలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బలవంతపు భూ సేకరణకు వెళ్లిన అధికారులను పేదలు అడ్డుకున్నారు. గతంలో టీడీపీ హయాంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి.. కొత్త పట్టాలు ఇవ్వడానికి అధికారులు ప్రయత్నించారు. దీంతో తమ స్థలాలను ఎలా వదులుకుంటామంటూ ఇళ్లపట్టాలు కలిగిన పేదలు ఆందోళనకు దిగారు. అయినా పట్టించుకోకుండా బలవంతంగా భూములు తీసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో రెవెన్యూ అధికారులను అడ్డుకున్న లబ్దిదారులు ఆందోళన చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story