యువతి విషయంలో గొడవ.. మధ్యవర్తిపై కత్తితో దాడి

యువతి విషయంలో గొడవ.. మధ్యవర్తిపై కత్తితో దాడి

ఇద్దరు ఆకతాయిల మధ్య ఘర్షణ.. ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. గొడవ వద్దన్ని చెప్పిన పాపానికి.. మధ్యవర్తిని దారుణంగా హత్య చేశారు కిరాతకులు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి విషయంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు ఆకతాయిలు గొడవ పడ్డారు. తన షాపు ముందు ఘర్షణ జరుగుతుండంతో.. లతీఫ్‌ అనే వ్యక్తి వారిని నిలువరించే ప్రయత్నం చేశాడు. గొడవ వద్దు.. ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకోవాలని చెప్పినందుకు కోపొద్రిక్తుడైన ఓ యువకునికి చెందిన వర్గీయులు లతీఫ్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. కత్తులతో దాడి చేయడంతో లతీఫ్‌ మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story