మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభం

X
By - TV5 Telugu |20 March 2020 9:58 PM IST
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కమల్ నాథ్ తన రాజీనామాను గవర్నర్ లాల్జీ టాండన్ కు సమర్పించారు. కమల్ నాథ్ ప్రభుత్వాన్ని శుక్రవారం మెజారిటీ నిరూపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ గురువారం అంగీకరించిన తరువాత, మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ మెజారిటీలో కొరత పడింది.
6 మంది మంత్రుల రాజీనామాను స్పీకర్ ఎన్పి ప్రజాపతి గతంలోనే ఆమోదించారు. మాజీ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పిటిషన్పై రెండు రోజుల విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ సమావేశం అయింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com