విదేశాల నుంచి వచ్చిన వాళ్లను చూస్తేనే టెన్షన్ పడుతున్న హైదరాబాదీలు
By - TV5 Telugu |24 March 2020 2:53 PM GMT
హైదరాబాదీలు విదేశాల నుంచి వచ్చిన వాళ్లను చూస్తేనే టెన్షన్ పడిపోతున్నారు. తాజాగా జగద్గిరిగుట్టలో ఇద్దరు విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కొందరు స్థానికులు. ఇటీవలే యూకే నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడితోపాటు, ఖతార్ నుంచి వచ్చిన మరో కుర్రాడీ కరోనా ఉందన్న అనుమానంతో కంప్లైంట్ చేశారు. ఈ ఇద్దరు యువకులకు వైద్యపరీక్షలు చేయించిన పోలీసులు.. జ్వరం, జలుబు లాంటి లక్షణాలు ఏమీ లేవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. కరోనా నివారణా చర్యల్లో భాగంగా ఇద్దరూ 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని సూచించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com