ఇటలీలో చిక్కుకున్నతెలుగు విద్యార్థి

కరోనా మరణ మృదంగం మోగిస్తున్న ఇటలీలో ఓ తెలుగు విద్యార్థి చిక్కుకుపోయాడు. తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన అఖిల్ అనే విద్యార్థి ఉన్నత విద్యకోసం ఇటలీ వెళ్లాడు. సెర్బియన్సా యూనివర్సీటిలో ఇంజినీరింగ్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అంతా బాగుంటుందనుంటున్న సమయంలో కరోనా మహమ్మారి ఇటలీని కమ్మేసింది. దీంతో అక్కడ ప్రస్తుతం ఇటలీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితులను చూసిన 18 ఏళ్ల అఖిల్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే తనను తన తల్లిదండ్రులకు చేరేలా చేయాలని ప్రధాని మోదీ, విదేశాంగ శాక మంత్రిని వేడుకుంటున్నాడు. ప్రస్తుతం ఇటలీలో పరిస్థితి ఘోరంగానే ఉందని.. అయినా తాను స్వదేశానికి వచ్చిన తరువాత సెల్ఫ్ క్వారంటైన్ను పాటిస్తానని.. ఎలాగైనా భారత్కు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com