కోవిడ్ -19 తాజా లెక్క.. ప్రపంచవ్యాప్తంగా 24,663 మంది మృతి

X
By - TV5 Telugu |28 March 2020 3:34 AM IST
కరోనావైరస్ వ్యాప్తి ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 24,663 కు చేరుకుంది. ఇందులో అత్యధికంగా ఇటలీలో 8215 మంది మరణించారు. ఆ తరువాత రెండో స్థానంలో స్పెయిన్ ఉంది. ఇక్కడ 4 వేల పైచిలుకు రోగులు మరణించారు. ఇక వైరస్ కు కేంద్రంగా ఉన్న చైనా మాత్రం మరణాల సంఖ్యలో మూడో స్థానంలో ఉంది. ఇక్కడ 3290 మంది మరణించారు. అమెరికాలో కూడా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది.
ఇక డిసెంబరులో చైనాలో మొట్టమొదటిసారిగా అంటువ్యాధి వెలువడినప్పటి నుండి 183 దేశాలు పాకింది.. మొత్తం 539,360 కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో, కనీసం 112,200 ఇప్పుడు కోలుకున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com