శ్రీకాకుళంలో కానిస్టేబుల్పై దాడి చేసిన తండ్రీ కొడుకులు

X
By - TV5 Telugu |28 March 2020 11:16 PM IST
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కానిస్టెబుల్పై తండ్రి కొడుకులు తిరబడ్డారు. బైక్ వెళ్లుతున్న వీరిద్దరిని కానిస్టెబుల్ జీవరత్నం అడ్డుకున్నాడు. బైక్పై ఇద్దరూ వెళ్లకూడదంటూ వారిని అడ్డుకున్నాడు. దీంతో.. అతనితో వాగ్వాదానికి దిగారు తండ్రికొడుకులు. కానిస్టెబుల్పై ఏకంగా.. రాళ్లు, కర్రతో దాడి చేశారు తండ్రికొడుకులు. ఈ దాడిలో కానిస్టెబుల్ జీవరత్నం తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని కోటబొమ్మాళ్లి పీహెచ్సీకి తరలించారు. ఈ దాడికి పాల్పడిన తండ్రికొడుకులు.. పరిశురాంపురం గ్రామస్థులుగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం తండ్రిని అదుపులో తీసుకున్నారు. కొడుకు మాత్రం పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com