కరోనావైరస్ పై పోరాటానికి సురేష్ రైనా రూ .52 లక్షల విరాళం
బారత క్రికెటర్ సురేష్ రైనా అవసరమైన సమయాల్లో అడుగులు ముందుకు వేశారు.. భారతదేశంలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారని కరోనావైరస్ ను ఎదుర్కోవడానికి 52 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో రూ .31 లక్షలను ప్రధాని జాతీయ సహాయ నిధికి, రూ .21 లక్షలను యూపీ సీఎం విపత్తు సహాయ నిధికి బదిలీ చేయనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్నీ రైనా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఇక శుక్రవారం, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కరోనా కట్టడికోసం రూ .50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ మరియు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్లకు ఒక్కొక్కరికి రూ .25 లక్షలు అందించాలని నిర్ణయించారు. మహమ్మారి బారిన పడిన వారికి సహాయపడటానికి భారత మాజీ క్రికెటర్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ .50 లక్షల విలువైన బియ్యం పంపిణీ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com