వీధి వ్యాపారులకు ఆర్ధిక సాయం అందించిన ఒడిశా సర్కార్

X
By - TV5 Telugu |29 March 2020 6:27 PM IST
ఒడిశా సర్కార్ లాక్ డౌన్ వలన ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న వీధి వ్యాపారులకు 3000 ఆర్ధిక సాయం చేసింది. రాష్ట్రంలోని 65వేల మంది వీధి వ్యాపారులను గుర్తించిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మూడువేల రూపాయలు అందించాలని జారీ చేశారు.ఒడిశాలోని 114 పట్టణాలకు చెందిన 65వేల మంది వీధి వ్యాపారులకు సాయం అందించారు. ఒడిశాలోని వలస కార్మికులకు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్ భవనాల్లో వసతి కల్పించాలని సీఎం జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బీహార్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలసకార్మికులను సహాయ పునరావాస శిబిరాలకు తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com