ఆ లక్షమందిని అక్కడికి తీసుకెళ్లండి : సీఎం యోగి
గత మూడు రోజులుగా దేశంలోని ఇతర ప్రాంతాల నుండి రాష్ట్రానికి వచ్చిన సుమారు లక్ష మంది వలస కార్మికులను క్వారంటైన్ వార్డులకు తరలించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనాపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్బంగా ఈ ఆదేశాలు జారీ చేశారు. తరలించే వారి పేర్లు, చిరునామాలు మరియు ఫోన్ నంబర్లను జిల్లా న్యాయాధికారులకు అందుబాటులో ఉంచాలని సూచించారు.
అలాగే వారికి ఆహారం మరియు ఇతర రోజువారీ అవసరాలను కూడా ఏర్పాటు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ - ఉత్తర ప్రదేశ్ సరిహద్దు మీదుగా సొంత ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు భారీగా ఈ బోర్డర్ వద్దకు తరలివచ్చారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు యుపి సరిహద్దు వద్ద భారీగా జనం గుమిగూడారు. భారీ జనాన్ని చూసిన స్పీ, ఎడిఎం అక్కడికక్కడే సరిహద్దులో ఉన్న ప్రజలను నిలిపివేశారు. వారు కూడా వెనక్కి వెళ్లిపోకుండా అక్కడే ఉన్నారు. దాంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com