ఒకే బిల్డింగ్‌లో ఉన్న 24 మందికి కరోనా పాజిటివ్!!

ఒకే బిల్డింగ్‌లో ఉన్న 24 మందికి కరోనా పాజిటివ్!!

సామాజిక దూరాన్ని పాటించండి మహాప్రభో అని ప్రభుత్వం నెత్తీ నోరు మొత్తుకుంటున్నా ఎవరూ వినట్లేదని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అంటున్నారు. ఢిల్లీలోని మర్కజ్ బిల్డింగ్‌లో నివసిస్తున్న 24 మంది కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన కారణంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్డింగ్‌లో ఉన్న మిగతా 1,034 మందిని ఖాళీ చేయించినట్లు ఆయన తెలిపారు. వీరిని ప్రత్యేక బస్సుల్లో ఆసుపత్రులకు, క్వారంటైన్‌లకు తరలించారు.

మత ప్రార్ధనల్లో పాల్గొనవద్దు అని ఎన్ని విజ్ఞప్తులు చేసినా 1500 నుంచి 1700 మంది పాల్గొన్నట్లు సమాచారం వచ్చిందని ఆయన అన్నారు. ఇకపై చర్యలు మరింత కఠినంగా ఉంటాయని, మత ప్రార్థనలు నిర్వహించిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదే చేయమంటూ డిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ భవనం వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story