మధ్యప్రదేశ్లో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు

మధ్యప్రదేశ్లో కరోనా మహమ్మారి కేసులు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి.. బుధవారం మరో 20 మంది కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 86 కి చేరుకుందని మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 20 కొత్త కేసులను నివేదించిన తరువాత, ఇండోర్ ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం నిర్వహించి, లాక్డౌన్ను మరో వారానికి పొడిగిస్తామని చెప్పారు. అంతేకాదు కర్ఫ్యూను మరింత కఠినంగా అమలు చేస్తాము" అని కలెక్టర్ మనీష్ సింగ్ అన్నారు.
వైరస్ నివారణ కోసం మంగళవారం రాజధాని నగరాన్ని నాలుగు వేర్వేరు విభాగాలుగా వర్గీకరించారు.. ఇందులో పాత మరియు కొత్త నగరాల మధ్య స్థానికుల కదలికలను పరిమితం చేశారు. సరైన ప్రామాణీకరణ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు తెలిపారు. కాగా భోపాల్లో ఒక జర్నలిస్ట్, అతని కుమార్తె మరియు రైల్వే గార్డుకు వైరస్ పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com