కరోనావైరస్ : చైనాను మించిపోయిన అమెరికా
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రస్తుతం అమెరికాలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అన్నివిధాలా చైనాను మించిపోయింది. కరోనా వైరస్ కోసం ఇప్పటివరకు అమెరికాలో పదిలక్షలకు పైగా ప్రజలను పరీక్షించారు. అమెరికాలో ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక పరీక్ష సామర్ధ్యం ఉంది. ఈ దేశంలో రోజువారీ పరీక్ష సామర్ధ్యం లక్షకు పైగా పెంచారు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం , చైనాలో 3,309 మరణాలు సంభవిస్తే.. అమెరికాలో మాత్రం 3,415 మరణాలు నమోదయ్యాయి.. కేసులు సైతం 165,000 నమోదయ్యాయి.
కాగా కరోనాపై పోరాటంలో రాబోయే 30 రోజులు అమెరికాకు చాలా ముఖ్యమైనవి అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రాబోయే తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వెంటిలేటర్లతో సహా టెస్టింగ్ కిట్లు, ఫేస్ మాస్క్ల ఉత్పత్తిని పెంచాలని డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ముసుగులు ధరించే అవకాశాన్ని కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. 33 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ట్రంప్. ఇది కాకుండా, లాక్డౌన్తో సహా రెండు డజనుకు పైగా రాష్ట్రాల్లో అనేక ఆంక్షలు విధించబడ్డాయి. ఈ కారణంగా సుమారు 25 కోట్ల జనాభా ఇళ్లలోలోనే ఉండిపోయారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com