కరోనాపై అవగాహన కల్పించేందుకు గుర్రమెక్కిన పోలీస్

కరోనాపై అవగాహన కల్పించేందుకు గుర్రమెక్కిన పోలీస్

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా ఏపీలో వేగంగా వ్యాప్తిస్తుంది. దీంతో పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కర్నూల్‌కు చెందిన పోలీసు వినూత్నపంతా ఎంచుకున్నారు. ప్ర‌జ‌లు ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని హెచ్చ‌రించేందుకు ఓ గుర్రానికి క‌రోనా వైర‌స్‌ను పెయింటింగ్‌గా వేయించారు. ప్రజల్లో అవగాహన తీసుకు రావడం కోసం గుర్రానికి కరోనా వైరస్ పెయింట్ వేసి విధుల్లో తిరుగుతున్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొంత మంది పోలీస్ చేసిన పనిని స‌మ‌ర్థిస్తుంటే.. మ‌రికొంద‌రేమో.. నోరులేని జీవాన్ని ఇలా హింసించ‌డం స‌రైన‌ది కాద‌ని కామెంట్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story