ఇప్పటికైనా మేలుకున్నారు సంతోషం.. ఆ జంతువులపై నిషేధం

ఇప్పటికైనా మేలుకున్నారు సంతోషం.. ఆ జంతువులపై నిషేధం

కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకనర్హం అన్న శ్రీశ్రీ కవితలాగా.. కనిపించిన కుక్క, నక్క, పిల్లి అన్నింటిని కరకరా నమిలేయడంతో కరోనా వచ్చి ఆ దేశ ప్రజలనే కాదు ప్రపంచం మొత్తాన్ని కకావికలం చేస్తోంది. మంచేమో కాని చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుందనే దానికి రుజువుగా ఈ వైరస్ కారణంగా నిమిషాల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా చైనాలో 3 వేల మంది బలయ్యారు. 81 వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పటివరకు ఈ వైరస్ 203 ప్రపంచ దేశాలకు విస్తరించింది. వైరస్ బారిన పడ్డ దేశాలన్నీ చైనాను వేలెత్తి చూపుతుంటే కొంచెమైనా పశ్చాత్తాపుతున్నట్లుంది. అన్నీ కాకపోయినా కొన్నింటినైనా తినడం మానేద్దామని నిర్ణయించుకున్నట్లుంది. ఈ మేరకు చైనాలోని షెన్‌జెన్ సిటీలో పిల్లులు, కుక్కలు, బల్లులు, పాముల విక్రయంపై నిషేధం విధించారు. మే 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలవుతాయి. అయితే ఈ చట్టం నుంచి పందులు, ఆవులు, గొర్రెలు, గాడిదలు, కోళ్లు, కుందేళ్లు, బాతులు, పావురాలు, పిట్టలను మినహాయించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది. ఏమోలే, ముందు ముందు మరిన్ని వింత వైరస్‌లు వ్యాప్తి చెందకుండా కొంతలో కొంత బెటర్.

Tags

Read MoreRead Less
Next Story