బాలయ్య బాబూ మీరు సూపరండీ.. 1 కోటి 25 లక్షలు
కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తూ ప్రపంచాన్నంతా వణికిస్తోంది. ఈ నేపథ్యంలో విధించిన లాక్డౌన్తో జనజీవనం స్థంభించి పోయింది. షూటింగులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇండస్ట్రీ కార్మికులను ఆదుకునే నిమిత్తం ఏర్పాటయిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ ఇంకా చాలా మంది స్టార్లు తమ వంతు సాయాన్ని అందించి ఉదారతను చాటుకుంటున్నారు. తాజాగా కథానాయకుడు నందమూరి బాలకృష్ణ 1 కోటి 25 లక్షల రూపాయల విరాళాన్ని ఛారిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్కు అందించారు. ఇందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి, 25 లక్షల రూపాయల చెక్ను సినీ కార్మికుల సహాయార్ధం ఛారిటీకి అందజేశారు. స్వీయనిర్భంధంలో ఉండి కరోనా కట్టడికి సహకరించమని ప్రజలకు బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com